పడిపూజ జరుగుతుంటే గుడ్డు విసిరారు..ఇద్దరు నిందితులు అరెస్ట్

పడిపూజ జరుగుతుంటే గుడ్డు విసిరారు..ఇద్దరు నిందితులు అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: అయ్యప్ప పడిపూజ జరుగుతుండగా.. కోడిగుడ్డు విసిరిన ఇద్దరు వ్యక్తులను సూరారం పోలీసులు అరెస్ట్​చేశారు. సీఐ సుధీర్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్టుకానిగూడ గ్రీన్​ఫీల్డ్​ హోమ్స్ కు చెందిన కె.పవన్​రెడ్డి శనివారం రాత్రి తన ఇంటి ముందు అయ్యప్ప పడిపూజ చేసుకుంటున్నాడు. 

ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్డు విసిరారు. తమ మనోభావాలు దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్​రెడ్డి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన పోలీసులు స్థానికులైన తోట ఆదిత్య, గండిమైసమ్మకు చెందిన సురురామ కృష్ణను నిందితులుగా గుర్తించారు. ఆదివారం వారిని అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ  పేర్కొన్నారు.