బీ ఫార్మసీ స్టూడెంట్​ ఆత్మహత్య

బీ ఫార్మసీ స్టూడెంట్​ ఆత్మహత్య
  • ఖమ్మం జిల్లాలో ఘటన

ఖమ్మం: ఖమ్మం రూరల్​మండలం బారు గూడెం పరిధిలో  ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్​కర్నూల్​జిల్లా అచ్చంపేటకు చెందిన బల్మూరి నరేశ్​(19) స్థానిక మహ్మదీయ కాలేజీలో బీఫార్మసీ ఫస్టియర్​చదువుతున్నాడు. వాయిపుత్ర నగర్​లో ఆరుగురు ఫ్రెండ్స్​తో కలిసి ఓ ఇంట్లో రెంట్​కు ఉంటున్నాడు. నిన్న రాత్రి అందరూ దాబాపై పడుకోగా.. నరేశ్ మాత్రం రూమ్‌లోనే పడుకుని మెట్లకు ఉన్న రెయిలింగ్​కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

ALSO READ:పార్లమెంట్ ముందు చిన్నయ్య బాధితురాలి ఆందోళన