కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ 3 గంటలే : బి.వినోద్​కుమార్​

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ 3 గంటలే : బి.వినోద్​కుమార్​
  •     ప్లానింగ్​ కమిషన్​ వైస్​చైర్మన్​వినోద్​కుమార్​

వేములవాడరూరల్, బోయినిపల్లి, వెలుగు : కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటల కరెంటే ఇస్తారని ప్లానింగ్​కమిషన్​ వైస్​ చైర్మన్ బి.వినోద్​కుమార్​ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, బోయినిపల్లి మండలాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం చందుర్తి, బోయినిపల్లి మండలకేంద్రాల్లో బీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయక ప్రజలపై అక్రమంగా కేసులు పెట్టే నాయకుడు కావాలో.. మీ కష్టాల్లో పాలుపంచుకునే తనలాంటి లీడర్​ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.

సీఎం కేసీఆర్​ ప్రకటించిన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలుచేస్తామన్నారు. బోయినిపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్​అభ్యర్థి సుంకె రవిశంకర్‌‌‌‌‌‌‌‌ను గెలిపించాలని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ-, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సీనియర్ నాయకుడు మనోహర్ రెడ్డి, ఎంపీపీ లావణ్య, లీడర్లు ఎల్లయ్య, అబ్రహం, శ్రీనివాసరావు, గోవిందరావు, కిషన్ రావు, శ్రీనివాస్, నర్సయ్య యాదవ్ పాల్గొన్నారు.