రాందేవ్ బాబాపై వెయ్యి కోట్ల దావా

రాందేవ్ బాబాపై వెయ్యి కోట్ల దావా

న్యూఢిల్లీ: అల్లోపతి మందులపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. రాందేవ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోడంతో ఈ వివాదానికి తెర పడిందని అంతా అనుకున్నారు. అయితే ఈ కామెంట్స్ పై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేగాక పరువు నష్టం కింద రూ.1,000 కోట్లు చెల్లించాలని రాందేవ్ మీద దావా వేసింది. తన వ్యాఖ్యలకు వివరణగా వీడియో రూపంలో సమాధానం ఇవ్వాలని లేదా 15 రోజుల్లోగా రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని ఐఎంఏ స్పష్టం చేసింది. ఇలా చేయకపోతే వెయ్యి కోట్లు చెల్లించాలని పిటిషన్ లో డిమాండ్ చేసింది.