భద్రాచలం,వెలుగు :భ ద్రాచలం ఏరియా ఆస్పత్రిలో గురువారం బాల భీముడు పుట్టాడు. 5 కిలోల బరువుతో జన్మించిన శిశువును చూసి వైద్య సిబ్బంది, పలువురు ఆశ్చర్యపోయారు. మణుగూరు టౌన్ కు చెందిన జోగునూరు రాణికి పురిటినొప్పులు రావడంతో భర్త బాబు స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ఆమెకు షుగర్లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి రెఫర్ చేశారు.
ఆస్పత్రి సూపరింటెండెంట్డాక్టర్ ముదిగొండ రామకృష్ణ ఆధ్వర్యంలో గైనకాలజిస్టులు మెడికల్ టెస్ట్ లు చేసిన అనంతరం గురువారం రాణికి సిజేరియన్ద్వారా కాన్పు చేశారు. పుట్టిన శిశువును పరీక్షించగా 5 కిలోల బరువు ఉన్నాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంతో ఉన్నారని సూపరింటెండెంట్ తెలిపారు.
