హైదరాబాద్, వెలుగు: రియాల్టీ సంస్థ వాసవి ఇన్ఫ్రాకాన్ హైదరాబాద్ బాచుపల్లిలోని అర్బన్ ప్రాజెక్ట్ ఆలస్యంపై కస్టమర్లు ఆందోళన చేయడంపై వివరణ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులోని ఫ్లాట్లను హామీ ఇచ్చిన గడువులోపే కస్టమర్లకు అందజేస్తామని ప్రకటించింది. కొన్ని బ్లాకులకు వచ్చే ఏడాది, మరికొన్నింటికి 2027లో, ఎనిమిదో బ్లాకుకు 2028లో జీహెచ్ఎంసీ ఓసీ ఇస్తామని ప్రకటించింది. కరోనా కేసుల కారణంగా తెలంగాణ రెరా రిజిస్ట్రేషన్ గడువును వచ్చే ఏడాది ఆగస్టు మూడో తేదీ వరకు వరకు పొడిగించిందని పేర్కొంది.
‘‘నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. చాలా బ్లాక్లు చివరి దశలో ఉన్నాయి. బ్లాక్-–9 నిర్మాణం మొత్తం పూర్తయింది. బ్లాక్–-8 న్యాయపరమైన కేసుల వల్ల ఆలస్యమైంది. ఆలస్యానికి పరిహారంగా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ప్రతి ఫ్లాట్కు నెలకు రూ.ఏడు వేలు చెల్లిస్తున్నాం” అని తెలిపింది.
