ఇటీవల కెరీర్లో మరింతగా స్పీడు పెంచారు ఎన్టీఆర్. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తన కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలవబోతోంది.
జనవరి వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఇప్పటికే షూట్ ఆలస్యమవడంతో వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు కంటిన్యూగా డేట్స్ ఇస్తున్నాడట ఎన్టీఆర్. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.
ఓ వైపు త్రివిక్రమ్, మరో వైపు నెల్సన్ దిలీప్ కుమార్లతో ఎన్టీఆర్ సినిమాలు చేయాల్సి ఉండగా ఇంకోవైపు ‘దేవర 2’ కూడా సెట్స్కు వెళ్లాల్సి ఉంది. వీటిలో ముందుగా కుమారస్వామి పురాణగాథతో త్రివిక్రమ్ తెరకెక్కించిన మైథాలాజికల్ మూవీ ముందుగా పట్టాలెక్కబోతోన్నట్టు సమాచారం. ఆ తర్వాత నెల్సన్ సినిమా, దేవర 2 సెట్స్కు వెళ్లనున్నాయి. వీటిలో దేనికదే ప్రత్యేకమైన జానర్ కావడం, ఎన్టీఆర్ను డిఫరెంట్గా ప్రజెంట్ చేసే క్రేజీ లైనప్ కావడంతో అంచనాలు పెరుగుతున్నాయి.
