ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే నాసిరకం రోడ్లు : కులాచారి దినేశ్

ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే నాసిరకం రోడ్లు : కులాచారి దినేశ్

ఇందల్వాయి, వెలుగు : రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​ కమీషన్లు, నిర్లక్ష్యంతోనే కాంట్రాక్టర్లు నాసిరకం రోడ్లు వేసి చేతులు దులుపుకుంటున్నారని బీజేపీ రూరల్​ ఇన్​చార్జి కులాచారి దినేశ్ ఆరోపించారు. ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న ఇందల్వాయి, ధర్పల్లి ప్రధాన రహదారిపై  దెబ్బతిన్న ప్రాంతాల్లో  మంగళవారం  ఆయన తాత్కాలిక రిపేర్లు చేయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సిమెంట్​ రోడ్డుపై తారు రోడ్డు వేయడంతో వర్షానికి కొట్టుకుపోయిందన్నారు. కార్యక్రమంలో  ఎంపీపీ గద్దె భూమన్న,  పద్మరెడ్డి,  రాజన్న, లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.