నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా లోకల్ బాడీస్అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన్ని నల్గొండ కలెక్టర్గా ప్రభుత్వం నియమించింది. 2018 బ్యాచ్కు చెందిన ఈయన గతంలో నిజామాబాద్జిల్లా అడిషనల్కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుత కలెక్టర్ఇలా త్రిపాఠి నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు.
గతేడాది అక్టోబర్లో జిల్లాకు కలెక్టర్గా వచ్చిన ఆమె 14 నెలల పాటు పనిచేశారు. హెల్త్, ఎడ్యుకేషన్, వడ్ల కొనుగోళ్లు, ప్రకృతి వ్యవసాయ, మకానా పంట సాగు, ఆయిల్ఫాంసాగు, పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. వడ్ల కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇందిరమ్మ ఇంటింటి సర్వే నిర్వహించడంలో రాష్ట్రంలో నల్లగొండ జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో తొలిసారిగా మోకాళ్ల మార్పిడి చికిత్స ఆపరేషన్ విజయవంతం చేయడం లో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. భవిత సెంటర్లు, మహిళలకు బాటరీలు వంటి అనేక వినూత్న కార్యక్రమాలకు ఇలా త్రిపాఠి శ్రీకారం చుట్టారు.
