కామారెడ్డిలో బహుజన పరివర్తన ర్యాలీ

కామారెడ్డిలో బహుజన పరివర్తన ర్యాలీ

కామారెడ్డిటౌన్​, వెలుగు :  కామారెడ్డి జిల్లా కేంద్రంలో  మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి  బహుజన పరివర్తన ర్యాలీ నిర్వహించారు.  వీక్లి మార్కెట్​ నుంచి  ప్రారంభమైన ర్యాలీ సుభాష్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, స్టేషన్​రోడ్డు,  రైల్వే కమాన్​, నిజాంసాగర్​ ఛౌరస్తా,   కొత్త బస్టాండుల మీదుగా  మున్సిపల్​ ఆఫీస్​ వరకు సాగింది.

ఇక్కడ ఉన్న డాక్టర్​ బి.ఆర్​. అంబేడ్కర్​,  జ్యోతిబాపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రతినిధులు కొంగల వెంకటి, ఆకుల బాబు, కొత్తపల్లి మల్లయ్య, గంగయ్య, రాజలింగంతో పాటు అంబేడ్కర్​ సంఘం, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.