బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

 బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

గద్వాల, వెలుగు: బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ గద్వాల జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా చేస్తున్న దీక్షకు శనివారం ప్రవీణ్​కుమార్ ​సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరూ అడగకుండా, పోరాటం చేయకుండానే కేంద్రం వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. 

కానీ గతంలో ఎస్టీలుగా ఉన్న వాల్మీకులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుట్ర పూరితంగా బీసీలలో కలిపారన్నారు. వాల్మీకి కులస్తులను ఎస్టీ జాబితాలో తిరిగి చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ ప్రభుత్వాలు ఎస్టీ జాబితాలో చేర్చకపోతే బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేరుస్తామని 
ప్రకటించారు.