
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. నిందితులైన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. తమను రాజకీయ దురుద్దేశంతో అరెస్ట్ చేశారని, తమపై ఎలాంటి సాక్ష్యాలు లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
కేసులో అరెస్టయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని కోర్టులో ప్రస్తావించారు. 90 రోజుల్లోనే తాము ఛార్జిషీట్వేశామని, వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్టు పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చివరగా పోలీసుల వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.