కంటతడి పెట్టిస్తున్న ‘బలగం’ నటి కథ

కంటతడి పెట్టిస్తున్న ‘బలగం’ నటి కథ

‘బలగం’ నటి విజయలక్ష్మి తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. రంగస్థల నటిగా పాపులరైన ఆమె తొలిసారి సినీ తెరపై నటించింది. అన్నని యాదికి తెచ్చుకుని ఏడిపిస్తూనే గడసరి పోశవ్వ పాత్రలో ఆకట్టుకుంది. అయితే, ఆమె తెరవెనుక జీవితంలో అన్నీ విషాదాలే.

భర్త అర్ధాంతరంగా కాలం చేశాడు. ఇద్దరు పిల్లలు ప్రయోజకులయ్యారనుకునే లోపే మరో పెను విషాదం.. నాలుగేళ్లు గడవక ముందే ఆమె చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటికే తన కోడలు గర్భవతి. తన జీవితంలో ఇంతకన్నా దారుణమైన ఘటన మరోటి ఉండదని విజయలక్ష్మి తెలిపింది. తాను ఇప్పటికీ ఈ విషాదం నుంచి తేరుకోలేకపోతున్నాను అంటూ భావోద్వేగానికి గురైంది.