
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాను మార్చి 3వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఇది తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ నేపథ్యంలో సాగే కథని అర్థమౌతుంది.
హీరో హీరోయిన్ మధ్య ప్రేమ.. హీరో బాకీతో ముడిపడిన అతని నిశ్చితార్థం.. ఆయన టెన్షన్ పడటం వంటి సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.