పంజాగుట్ట, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ రథోత్సం బుధవారం సాయంత్రం వైభవంగా సాగింది. మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని, సనత్ నగర్ కాంగ్రెస్ఇన్చార్జ్ కోట నీలిమ, కలెక్టర్అనుదీప్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్హారతిచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు.
వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాలు సజావుగా సాగాయని, కాంగ్రెస్కార్యకర్తలు, వలంటీర్లు మంచిగా పనిచేశారని కోట నీలిమ తెలిపారు.