30 రోజులు కష్టపడండి.. ఐదేళ్లు శ్రమిస్తా : అన్నపూర్ణమ్మ

30 రోజులు కష్టపడండి.. ఐదేళ్లు శ్రమిస్తా : అన్నపూర్ణమ్మ

నిజామాబాద్​, వెలుగు:  ఎన్నికలు పూర్తయ్యేదాకా ఈ 30 రోజులు తన గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడితే ప్రజల కోసం ఐదేళ్లు కష్టపడతానని బాల్కొండ బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. మంగళ వారం ఆమె ఎర్గట్ల మండలం తడ్​పాకల్, బట్టాపూర్​ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి ప్రశాంత్​రెడ్డి కనుసన్నల్లో  ఆయన అనుచరులు బట్టాపూర్​ మైనింగ్​ క్వారీ నడిపి భారీగా సంపాదించారన్నారు. క్వారీ అక్రమాలపై తన కొడుకు మల్లిఖార్జన్​రెడ్డి హైకోర్టుకు వెళ్లి మూసివేత ఆర్డర్స్​ తెచ్చేదాకా సర్కారు కళ్లు మూసుకుందన్నారు. 

కాంగ్రెస్ అభ్యర్థి​ గెలిస్తే బీఆర్​ఎస్​లో చేరబోమని హామీ ఇస్తారా అని ప్రశ్నించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్​ సభ్యుడు తోకల నర్సయ్య, మల్కన్నగారి మోహన్​, నారాయణరెడ్డి, రమేశ్​రెడ్డి, రంజిత్​ తదితరులు ఉన్నారు. తరువాత మండల కేంద్రంలోని పాండురంగ ఫంక్షన్​ హాల్​ లో బీజేపీ బూత్​లెవల్​ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, పేరాల శేఖర్​రావు, మల్లిఖార్జున్​రెడ్డి తదితరులు ఉన్నారు.