హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే మూడు కీలక కమిటీలను నియమించింది. ఈటల రాజేందర్ కన్వీనర్గా ‘చేరికలపై సమన్వయ కమిటీ’ని, జితేందర్రెడ్డి కన్వీనర్గా ‘ఫైనాన్స్ కమిటీ’ని, ధర్మపురి అర్వింద్ కన్వీనర్గా ‘ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ’ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఏర్పాటు చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామికి ‘చేరికలపై సమన్వయ కమిటీ’తోపాటు ‘ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ’లో చోటు దక్కింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావును కూడా చేరికలు, ఫైనాన్స్ కమిటీల్లోకి తీసుకున్నారు. కాగా, ఇప్పటి వరకు బీజేపీ చేరికల కమిటీకి చైర్మన్గా ఉన్న పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆ పదవి నుంచి తప్పుకున్నారు.
చేరికలపై సమన్వయ కమిటీ
1. ఈటల రాజేందర్ (కన్వీనర్)
2. డీకే అరుణ
3. కె. లక్ష్మణ్
4. వివేక్ వెంకటస్వామి
5. గరికపాటి మోహన్రావు
6. ఎ.చంద్రశేఖర్
7. కొండా విశ్వేశ్వర్రెడ్డి
8. దుగ్యాల ప్రదీప్కుమార్
ఫైనాన్స్ కమిటీ
1. జితేందర్రెడ్డి (కన్వీనర్)
2. గరికపాటి మోహన్రావు
3. చాడ సురేశ్రెడ్డి
4. చింతల రామచంద్రారెడ్డి
5. శాంతి కుమార్
6. యోగానంద్
ప్రజా సమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ
1. ధర్మపురి అర్వింద్ (కన్వీనర్)
2. వివేక్ వెంకటస్వామి
3. రఘునందన్రావు
4. స్వామిగౌడ్
5. ప్రకాశ్రెడ్డి
6. బాబీ అజ్మీరా