
సినీ నటి జమున మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం తెలిపారు. "తెలుగు సినిమా సీనియర్ నటి, మాజీ ఎంపీ శ్రీమతి జమున గారి మరణం విచారకరం. దక్షిణాది భాషలన్నంటితో పాటు, పలు హిందీ సినిమాల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, తను వెండితెరపై పోషించిన పాత్రలు చిరఃస్మరణీయం. సత్యభామ పాత్రతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. మాజీ ప్రధాని వాజ్ పేయి గారి హయాంలో, వారు బిజెపి తరపున చురుగ్గా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని బండి సంజయ్ ట్విట్టర్ వేదిక పేర్కొన్నారు.
సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉదయం 12 గంటలకు ఆమె భౌతిక కాయాన్ని ఫిలింనగర్ ఛాంబర్ కు తరలించనున్నారు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం మధ్యాహ్నాం 3 గంటల వరకు ఫిల్మ్ ఛాంబర్ లోనే జమున భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం అక్కడి నుండి అంతిమయాత్రగా తీసుకెళ్లి జూబ్లీహీల్స్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు చేయనున్నారు.