గొల్లకుర్మలకు డబ్బులు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన:బండి సంజయ్

గొల్లకుర్మలకు డబ్బులు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన:బండి సంజయ్

గొల్ల కుర్మలకు తెలంగాణ సర్కార్ ఫ్రీజ్ చేసిన డబ్బులను వెంటనే చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  డిమాండ్ చేశారు. గొల్ల కుర్మల కోసం తెలంగాణ సర్కార్ డబ్బులను వారి ఖాతాల్లో జమచేసి వాటిని తీసుకోకుండా ఫ్రీజ్ చేసిందని ఫైరయ్యారు. తక్షణమే వారికి చెల్లించాల్సిన డబ్బులు అందించాలన్నారు. లేదంటే ఈ పోరాటం ఒక్క మునుగోడుతోనే ఆగిపోదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గొల్ల కుర్మల కోసం పోరాడితే అరెస్టు చేయడం అన్యాయమని బండి సంజయ్ అన్నారు. ప్రజల కోసం పోరాడితే తప్పా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామన్నారు. బీజేపీ తరపున పోరాటాలు ఉధృతం చేసి గొల్ల కుర్మలకు అండగా నిలుస్తామని బండి సంజయ్ స్పష్టంచేశారు.