
- విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనే డబ్బుతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి
- బీఆర్ఎస్ సర్కార్కు బండి సంజయ్ డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు : ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ను కొనే డబ్బుతో తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని బీఆర్ఎస్ సర్కార్ను బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. అలాగే, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ డబ్బులు ఖర్చు పెట్టాల న్నారు. గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయడం లేదని ఏపీ పర్యటనలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రకటించగా.. మంత్రులు కేటీఆర్, హరీశ్ చేసిన కామెంట్లపై సంజయ్ స్పందించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్లో పాల్గొంటామని సీఎం కేసీఆర్, కేటీఆర్ చెప్పారని, అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లేదని క్లారిటీ ఇచ్చారన్నా రు. అందువల్ల ఆ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసే డబ్బులను తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఖర్చు చేయాలన్నా రు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లో బీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ సెంటిమెంట్ ను రగిలిస్తున్నాయని ఆరోపించారు.