సమాధానం చెప్పలేకనే భౌతిక దాడులు:బండి సంజయ్ 

 సమాధానం చెప్పలేకనే భౌతిక దాడులు:బండి సంజయ్ 

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కు బండి సంజయ్ ఫోన్ చేశారు. అర్వింద్ ఇంటిపై జరిగిన దాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే దమ్ములేక భౌతిక దాడులకు దిగి రౌడీయిజం చేస్తారా అని మండిపడ్డారు.అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతును నొక్కాలనుకుంటున్నరని ఆరోపించారు. 

గడీల గూండాల దాడులకు... తోక ఊపులకు భయపడబోమని  బండి సంజయ్ చెప్పారు. బీజేపీ సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు... కమలం కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరని హెచ్చరించారు. ప్రజలే టీఆర్ఎస్ గూండాలకు కర్రుకాల్చి వాతపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.