హైదరాబాద్కు బండి సంజయ్... శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం

హైదరాబాద్కు బండి సంజయ్... శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం


బీజేపీ ఎంపీ  బండి సంజయ్ హైదరాబాద్లో అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిన ఎంపీ బండి సంజయ్.. తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు.  శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న  బండి సంజయ్ కు బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. 

 అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలంతా దేశంలో  మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు బండి సంజయ్ తెలిపారు. ఇండియాలో ఎన్ఐఆర్ లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అన్నీ ఇన్నీ కాదని..అందుకే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. భారతీయులందరూ అమెరికాలో గల్లా ఎగిరెసుకొని తిరుగుతున్నామంటే అమెరికాలో మోదీకి ఉన్న గౌరవమే అని చెప్పారు. 

 తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప అభివృద్ధి చెందదని అమెరికాలోని తెలంగాణ వాసులు  చెప్పినట్లు బండి సంజయ్ తెలిపారు. తెలంగాణలో దసరా, సంక్రాంతి వచ్చినప్పుడు ఎలాగైతే సిటీ ఖాళీ అవుతుందో అదే విధంగా దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. అమెరికాలోని భారత పౌరులు బీజేపీకి ఓటేసేందుకు వస్తామని అక్కడి తెలుగు ప్రజలు చెప్పినట్లు బండి సంజయ్ చెప్పారు.