
దేశ రాజకీయాల్లోకి వెళ్లి కేసీఆర్ చేసేదేం లేదన్నారు బీజీపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. తన అవినీతి గురించి ప్రజల దృష్టి మరల్చేందుకు కేసీఆర్ డ్రామాలాడుతున్నారన్నారు. తెలంగాణలో ఏం పొడిచారని.. కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్తారన్నారు. దోచుకొని దాచుకోవడం తప్ప కేసీఆర్ చేసిందేమి లేదన్నారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలే ప్రయోజనమన్న కేసీఆర్..ఇపుడు దేశరాజకీయాల్లోకి వెళ్తానంటుండన్నారు. భారతీయ వ్యతిరేక భావజాలంతో ముందుకెళ్తున్నారన్నారు. ఇదంతా తుక్డే గ్యాంగ్ అని అన్నారు. కేసీఆర్ దోచుకున్న డబ్బుపై విచారణ జరుగుతోందన్నారు. మోడీ, యోగీ దేశాన్ని ఎవరూ ఏం చేయలేరని జిహాదీలే చెబుతున్నారన్నారు. మోడీ లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోవాలన్నారు.
దేశంలో నంబర్ వన్ అవినీతిపరుడు కేసీఆర్ అని అన్నారు. గతంలో ఫ్రంట్ అని అన్ని రాష్ట్రాలు తిరిగిన చంద్రబాబు నాయుడికి ఏ గతి పట్టిందో కేసీఆర్ కు కూడా అదే గతి పడుతుందన్నారు. కేసీఆర్ కు శని నెత్తిమీద కూర్చుందన్నారు. ఏకగ్రీవ సర్పంచులకు ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు . ఆత్మహత్యల తెలంగాణగా మార్చారన్నారు. గ్రామాల్లో సర్పంచుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. గ్రామాలకు ఎన్ని నిధులు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ ఎన్నికల హామీలు నెరవేర్చాలన్నారు బండి సంజయ్.