టీఆర్ఎస్ తో పొత్తు..కాంగ్రెస్ ఎంపీలకు ఇష్టం లేదు

టీఆర్ఎస్ తో పొత్తు..కాంగ్రెస్ ఎంపీలకు ఇష్టం లేదు

టీఆర్ఎస్ తో పొత్తు తెలంగాణ కాంగ్రెస్  ఎంపీలకు ఇష్టం లేదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. టీఆర్ఎస్ తో పొత్తుకు కాంగ్రెస్ హైకమాండ్ సుముఖంగా ఉందన్నారు. అందుకే ఈ మధ్య  టీఆర్ఎస్ కు పార్లమెంట్ లో కాంగ్రెస్ సభ్యులు మద్దతిచ్చిందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తో కేసీఆర్ ఎప్పటి నుండో టచ్ లో ఉన్నారన్నారు. కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తుకు  ఏపీ కాంగ్రెస్ నేత మధ్యవర్తిత్వం వహిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసినా టీఆర్ఎస్ కు ఓటు వేసినట్లేనని ఎప్పుడో చెప్పానన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆ రెండు పార్టీలు ఒక్కటేనని నమ్ముతున్నారన్నారు. 

ఇవి కూడా చదవండి: 

బీజేపోళ్లను తరిమి కొట్టకపోతే దేశం నాశనమవుతుంది

బీజేపీ అవినీతిపై ఢిల్లీలో పంచాయితీ పెడ్తా