బీజేపీ నేతల ఇంటికి బండి సంజయ్

బీజేపీ నేతల ఇంటికి బండి సంజయ్

జాగరణ దీక్షలో భాగంగా అరెస్ట్ జైల్లో ఉన్న బీజేపీ నేతల కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఇంటింటికి వెళ్లి జైల్లో ఉన్న నేతల కుటుంబాలను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు.మరోవైపు ఇవాళ మధ్యాహ్నం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కరీంనగర్ వెళ్లనున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ లతో కలిసి నేరుగా కరీంనగర్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ కార్పొరేటర్లు కచ్చు రవి, పెద్దపల్లి జితేందర్, బీజేపీ నాయకులు పుప్పాల రఘు, రాపర్తి ప్రసాద్, ఉప్పరపల్లి శ్రీనివాస్ లను పరామర్శించనున్నారు. అనంతరం ఆయన కరీంనగర్ జైలు ఆవరణలో మీడియాతో మాట్లాడనున్నారు. 

కాసేపటి క్రితమే ఛత్తీస్ గడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయన కూడా పలువురు బీజేపీ నేతలతో కలిసి కరీంనగర్ వెళ్లనున్నారు. ముందుగా బండి సంజయ్ ని కలిసి తర్వాత.. కరీంనగర్ జైల్ లో ఉన్న బీజేపీ నేతలను పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  రాయపూర్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రమణ్ సింగ్ శంషాబాద్ విమానాశ్రయంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ శాలువా కప్పి పుష్ప గుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఆయన కరీంనగర్ కు బయల్దేరారు.

ఇవి కూడా చదవండి:

బండి నడపడానికి లైసెన్స్ అవసరం లేదు.. విద్యార్థి వాదన

పనిమనిషిగా చేరి.. ఇంటి యజమానినే తరిమేసింది