పనిమనిషిగా చేరి.. ఇంటి యజమానినే తరిమేసింది

పనిమనిషిగా చేరి.. ఇంటి యజమానినే తరిమేసింది
  • పని మనిషిగా చేరి..  ఫ్లాట్ కబ్జా
  • ఒంటరి వృద్ధురాలిని గెంటేసిన మహిళ 
  • జిల్లా న్యాయ సేవాధికార సంస్థ 
  • చొరవతో బాధితురాలికి న్యాయం

ఎల్​బీ నగర్,వెలుగు: ఒంటరిగా ఉంటోన్న వృద్ధురాలి ఫ్లాట్ లో పనిమనిషిగా చేరిన ఓ మహిళ తర్వాత ఆమెనే ఇంట్లో నుంచి తరిమేసింది. వృద్ధురాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించడంతో అధికారులు బుధవారం వృద్ధురాలికి ఫ్లాట్​ను అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. వృద్ధురాలైన ఆవుల విజయలక్ష్మి , కొడుకు రామకోటేశ్వర్ రావుతో కలిసి  బాలాపూర్ లోని జనప్రియ అపార్ట్ మెంట్ లో ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కొని ఉంటోంది.  గతేడాది గుగులోతు దేవమ్మ అనే మహిళ వీరి ఇంట్లో  పనిమనిషిగా చేరింది.  ఈ ఏడాది మే 25న రామకోటేశ్వర్​ రావు అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో విజయలక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఫ్లాట్​ను పనిమనిషి దేవమ్మ సొంతం చేసుకోవాలనుకుంది. విజయలక్ష్మిని తరచూ వేధించి, చివరికి ఇంట్లో నుంచి తరిమేసింది. దీంతో బాధితురాలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది.  స్పందించిన జడ్జి శ్రీదేవి.. కేసు విచారించి, రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో బాధితురాలికి ఇంటిని తిరిగి అప్పగించింది.