పోలీసులు ఎంత నిఘా ఉంచినా.. న్యూ ఇయర్ కోసం డ్రగ్స్ రవాణా చేస్తూనే ఉన్నారు కొందరు. వేడుకల్లో డ్రగ్స్ వినియోగానికి డిమాండ్ ఉంటుందని భావించి.. అక్రమ మార్గంలో డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం (డిసెంబర్ 26) హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.
ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్, 5 గురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిలో మల్లారెడ్డి ఆసుపత్రిలో పని చేసే ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉన్నట్లు సమాచారం. ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ ఎస్ ఓ టీ పోలీసులు.
నిందితుల నుంచి రూ. 4 లక్షల విలువ చేసే 70గ్రాముల MDMA డ్రగ్ , రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం, పార్టీలు చేసుకునేందుకు బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణ చేస్తుండగా పట్టుకున్నారు మేడ్చల్ ఎస్ ఓ టి పోలీసులు.
►ALSO READ | తప్పతాగి తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగినిపై.. కారులో సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ఈ మహిళ కూడా..!
