ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. గిరిజనులకు పట్టాలు ఇస్తామన్న హామీలను నిలుపుకోవాలని కోరారు. పోడు భూములకు పట్టాలపై తాము చేసిన పోరాటాల వల్లే ప్రభుత్వం 2021 నవంబర్ లో గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించిందని చెప్పారు. అయితే ఇప్పటికే సమస్యలకు పూర్తి పరిష్కారం లభించలేదన్నారు. 2018 నవంబర్ 23న మహబూబాబాద్ బహిరంగ సభలో అవసరమైతే కుర్చీలు వేసుకొని మరీ పోడు రైతులకు పట్టాలు ఇస్తామన్న కేసీఆర్ హామీని సంజయ్ గుర్తు చేశారు. పట్టాలు ఇస్తామంటే, కుర్చీలు ఏర్పాటు చేయడానికి బీజేపీ, గిరిజనులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి వీలుగా రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ అధికారులతో పాటు ఫారెస్ట్ అధికారులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
జూలై 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు గారికి బహిరంగ లేఖ.@TelanganaCMO pic.twitter.com/35mT70sUF5
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 8, 2022