గద్వాల, వెలుగు: గద్వాల మున్సిపాలిటీ అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ గా జయలక్ష్మి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్ పర్సన్ కు, వైస్ చైర్పర్సన్ శంకర్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్రాహ్మణులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ను ఆశీర్వదించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల మున్సిపాలిటీని ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. చైర్ పర్సన్ జయలక్ష్మి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇచ్చిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
