హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ప్రస్తుతం తమకు 60 రెస్టారెంట్లు ఉన్నాయని, రెండుమూడేళ్లలో వీటి సంఖ్యను వందకు చేర్చుతామని బార్బెక్యూ & గ్రిల్ బఫే రెస్టారెంట్ చెయిన్ అబ్సల్యూట్ బార్బెక్యూస్ ప్రకటించింది. హైదరాబాద్లోని అత్తాపూర్లో 13వ అవుట్లెట్ప్రారంభోత్సవం సందర్భంగా సంస్థ జీఎం (ఆపరేషన్స్) దేవవ్రత మిశ్రా మీడియాతో మాట్లాడుతూ వైజాగ్, విజయవాడలో త్వరలో మరో రెండు అవుట్లెట్లను మొదలుపెడతామని చెప్పారు.
వీటితో కలిపి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే తమ అవుట్లెట్ల సంఖ్య 15కు చేరుకోనుందని వివరించారు. అబ్సల్యూట్ బార్బెక్యూస్లో 75కి పైగా విభిన్నమైన రుచులతో కస్టమర్లకు నోరూరించే వంటకాలను అందిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ప్రారంభించిన రెస్టారెంటులో 130 మంది కూర్చోవచ్చని వివరించారు. తమ రెస్టారెంట్లలో నెలకు దాదాపు మూడు లక్షల మంది తింటున్నారని మిశ్రా వివరించారు
