మహిళ బస్సు ముందుకు రావడం వల్లే ప్రమాదం: డిపో మేనేజర్

మహిళ బస్సు ముందుకు రావడం వల్లే ప్రమాదం: డిపో మేనేజర్

హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఆర్టీసీ బస్సు కింద మహిళ పడి మృతి చెందిన ఘటనపై బర్కత్ పుర డిపో మేనేజర్ మాట్లాడారు. బస్సు ఒక్కసారిగా డౌన్ లోకి రావడం అప్పుడే స్కూటీ మీద ఉన్న మహిళ పక్కనుంచి బస్సు ముందుకు రావడం వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు. ఆ మహిళ బస్సుకింద పడి మృతి చెందడం దురదృష్టకరమని చెప్పారు. అయితే బస్సు పూర్తి స్థాయిలో ఫిట్ నెస్ తోనే ఉందని చెప్పారు న్యూ నల్లకుంటకు చెందిన అడ్డాకుల శ్రీనివాస్ బస్ ను డ్రైవ్ చేసినట్టు తెలిపాడు. గత 15రోజులుగా అతనే ఆ బస్సును నడుపుతున్నట్లు చెప్పారు. కొండాపూర్ నుంచి కోటివైపు నడుపుతున్న బస్ 127 కే అని చెప్పారు. ఈ సంఘటన మీద పూర్తి విచారణ చేసి డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు.

స్కూటీని గుద్దిన ఆర్టీసీ బస్సు : మహిళ మృతి
ఇద్దరు పిల్లలున్నా.. భార్యకు మరో పెళ్లి చేసిన భర్త