
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో ట్రిపుల్ ఐటీ మెస్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కిచెన్ చెత్తచెదారంతో మురికి వాడలా దర్శనమిస్తోంది. కుళ్లిపోయిన బెండకాయలు, ముక్కిపోయిన బియ్యం, స్టోరేజీలో సరుకులు చెత్తకుప్పలా పడేశారు. సరుకులు మట్టికుప్ప దగ్గర కనిపిస్తున్నాయి. డ్రమ్ములు మురికిగా ఎక్కడపడితే అక్కడ..కిచన్ డ్రైనేజీని తలపిస్తోంది