
బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు శనివారం వేపకాయల బతుకమ్మను నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ట్యాంక్బండ్ తీరాన మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ ఎండీ ఏ) ఆధ్వర్యంలో కార్నివాల్ పేరుతో నిర్వహించిన ఉత్సవాలు కనువిందు చేశాయి.
ట్యాంక్బండ్ పరిసరాలను వివిధ రకాల బతుకమ్మ డిజైన్లతో అందంగా ముస్తాబు చేశారు. సంప్రదాయ నృత్యాలు, జానపదాలు, నాటికలు ఆకట్టుకున్నాయి. హుస్సేన్ సాగర్లో రంగురంగుల కాంతులతో తేలియాడిన బతుకమ్మ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. వివిధ రకాల తెలంగాణ వంటకాలతో ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు నగర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ జోష్ కొనసాగింది.