
గుమి: తెలంగాణ యంగ్ అథ్లెట్ అగసార నందిని.. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్తో మెరిసింది. శుక్రవారం ముగిసిన హెప్టాథ్లాన్లో నందిని 5491 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. ఆసియా అథ్లెటిక్స్లో బరిలోకి దిగిన తొలిసారే నందిని గోల్డ్ గెలవడం విశేషం. అలాగే ఆసియా చాంపియన్షిప్లో గోల్డ్ గెలిచిన మూడో ఇండియన్ హెఫ్టాథ్లెట్గా రికార్డులకెక్కింది. స్వప్న బర్మన్ (2017), సోమా బిస్వాస్ (2005) ముందున్నారు. 100 మీటర్ల హర్డిల్స్ను 13.67 సెకన్లలో ముగించిన నందిని హైజంప్లో 1.69 మీటర్ల ఎత్తును క్లియర్ చేసింది.
షాట్పుట్లో ఇనుప గుండును 13.54 మీటర్ల దూరం విసిరింది. 200 మీటర్ల రేసును 24.02 సెకన్లలో ముగించింది. లాంగ్ జంప్లో 6.13 మీటర్ల దూరం దూకింది. జావెలిన్ త్రోలో ఈటెను 34.18 మీటర్ల దూరం విసరడంతో పాటు 800 మీటర్ల రేసును 2:15.54 సెకన్లలో ముగించి టాప్ ప్లేస్ను సొంతం చేసుకుంది. లియు జింగ్యి (చైనా, 5869), కాయ్ యువాన్ చెన్ (చైనీస్తైపీ, 5608) వరుసగా రజతం, కాంస్యం నెగ్గారు. మెన్స్ 5 వేల మీటర్లలో గుల్వీర్ సింగ్ 13ని:24.77 సెకన్లతో గోల్డ్ మెడల్ సాధించాడు.
ఈ క్రమంలో 2015లో మహ్మద్ అల్ గర్నీ (ఖతార్, 13:34.47 సె) నెలకొల్పిన మీట్ రికార్డును బ్రేక్ చేశాడు. ఓవరాల్గా ఈ టోర్నీలో గుల్వీర్కు ఇది రెండో బంగారు పతకం కావడం విశేషం. ఇక ఆసియాలో గోల్డ్ నెగ్గిన మూడో ఇండియన్గానూ రికార్డులకెక్కాడు. గోపాల్ సైనీ (1981), బహుదూర్ ప్రసాద్ (1993), జి. లక్ష్మణన్ (2017) ముందున్నారు. విమెన్స్ హైజంప్ ఫైనల్లో పూజ సింగ్ 1.89 మీటర్ల ఎత్తును క్లియర్ చేసి గోల్డ్ మెడల్ సాధించింది. ఇది ఆమె పర్సనల్ బెస్ట్ కావడం విశేషం. విమెన్స్ 3 వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్లో పారుల్ చౌదరి 9:12.46 సెకన్లతో సిల్వర్ గెలుచుకుంది. అంకిత (9:41.54 సెకన్లు) ఐదో ప్లేస్లో నిలిచింది. ఓవరాల్గా ఇండియా ఖాతాలో 18 (8 గోల్డ్, 7 సిల్వర్, 3 బ్రాంజ్) పతకాలు ఉన్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఆసియా అథ్లెటిక్స్లో గోల్డ్ నెగ్గిన నందినికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్ లో ఆమె మరిన్ని విజయాలను అందుకోవాలని సీఎం ట్వీట్ చేశారు.
గాయాన్ని లెక్క చేయకుండా ఆడి..
ఆసియా అథ్లెటిక్స్లో నేను పోటీపడటం ఇదే తొలిసారి. ఫస్ట్ అటెంప్ట్లోనే గోల్డ్ కొట్టినందుకు ఆనందంగా ఉంది. ఓవరాల్ పాయింట్లలో నా బెస్ట్ పెర్ఫామెన్స్ చేసినందుకు మరింత హ్యాపీ. నిజానికి నేను ఈ టోర్నీలో పాల్గొంటానని అనుకోలేదు. ఎందుకంటే గతేడాది అయిన భుజం గాయంనుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కానీ, తెలంగాణకు గోల్డ్ తీసుకొచ్చి.. ఈ టోర్నీకి క్వాలిఫై అవ్వాలని గాయంతో గత నెలలో సీనియర్ నేషనల్ ఫెడరేషన్ కప్లో పాల్గొన్నా. తర్వాత నెల రోజుల పాటు త్రివేండ్రంలో నేషనల్ క్యాంప్లో ట్రెయినింగ్ తీసుకోవడం నాకు ప్లస్ పాయింట్ అయింది.
ఇండియా అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ రాధాకృష్ణ సర్, ఇతర కోచ్లు నాకెంతో సపోర్ట్ ఇచ్చారు. ఆ ఉత్సాహంతో గాయాన్ని లెక్కచేయకుండా ఆసియా అథ్లెటిక్స్లో పాల్గొని గోల్డ్ సాధించా. హెప్టాథ్లాన్లో 6 వేల పాయింట్ల మార్కును దాటడమే నా తదుపరి టార్గెట్. మన స్టేట్ నుంచి జేజే శోభ అక్క తొలిసారి 6 వేల పాయింట్లు అందుకుంది. ఆమె తర్వాత నేను కూడా ఆ మార్కు అందుకోవాలి. తదుపరి ఆసియా గేమ్స్పై ఫోకస్ పెడతా. గత ఎడిషన్లో కాంస్యం నెగ్గాను. ఈ సారి గోల్డ్పై గురి పెడతా. కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ అథ్లెటిక్స్నూ బంగారు పతకాలు అందుకొని ఒలింపిక్ చాంపియన్గా నిలవడమే నా టార్గెట్.
వెలుగుతో నందిని