బీసీ బంద్ఎఫెక్ట్.. సిటీలో బస్సులు బంద్..దోచుకుంటున్న క్యాబ్ డ్రైవర్లు

బీసీ బంద్ఎఫెక్ట్.. సిటీలో బస్సులు బంద్..దోచుకుంటున్న క్యాబ్ డ్రైవర్లు

హైదరాబాద్​నగరంలో బీసీ బంద్ తో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. సిటీలో అన్ని డిపోల్లో బస్సులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీపావళి పండుగలకు వెళ్లే ప్రజలకు బస్సులు లేకపోవడంతో ప్రైవట్​ ఆటోలు, క్యాబ్​ లను ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులను ఆసరాగా చేసుకొని అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారు.  డబుల్​ రేట్లు వసూలు చేస్తున్నారు క్యాబ్​ డ్రైవర్లు. 

బీసీ బంద్​సందర్భంగా ఉప్పల్​ రింగు రోడ్డు దగ్గర ప్రైవేట్​ క్యాబ్​డ్రైవర్లు అధిక ఛార్జీల దందా చేశారు. ఉప్పల్​ నుంచి హన్మకొండకు ప్రయాణికుల నుంచి సాధారణ రేట్లకంటే అధికంగా డబుల్ ఛార్జీలను వసూలు చేశారు. 300 రూపాయలు ఛార్జీ ఉండగా.. 700లకు పైగా వసూలు చేస్తున్నారు. ఒక్క ఉప్పల్​ రింగు రోడ్డులోనే కాదు.. ఎల్బీనగర్, సాగర్​రింగ్​రోడ్డు, సీబీఎస్ బస్ స్టేషన్ల దగ్గర ఊళ్లకు వెళ్లే ప్రయాణికులనుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.