
హైదరాబాద్ : బీసీ డిక్లరేషన్ వెనకబడిన వర్గాల పట్ల తమ పార్టీ నిబద్ధతకు నిదర్శనమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా, జనాభా ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు, బీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం, ఇవన్నీ బీసీలకు మేలు చేసేవేనని తెలిపారు.
బీసీలకు గత ప్రభుత్వాల అన్యాయాన్ని మోడీ ప్రభుత్వం సరిదిద్దుతున్నదన్నారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ చేసిన అన్యాయాన్ని వచ్చే బీజేపీ ప్రభుత్వం సరిచేస్తుందని తెలిపారు. ఆరు నెలల తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమన్నారు.
బీసీ డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ , ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు.