కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం బీసీ జేఎసీ ఆధ్వర్యంలో బీసీ ద్రోహుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బీసీల పట్ల మొండి వైఖరి వీడాలన్నారు.
బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్, రాజయ్య, మల్లయ్య, హజీజ్, రాజీవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
