- బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ భిక్షపతి
ములుగు, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణే పరిష్కారమని బీసీ జేఏసీ ములుగు జిల్లా చైర్మన్ ముంజాల భిక్షపతి అన్నారు. గురువారం ములుగులోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తోటకూరి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్చేశారు.
రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. బీసీల 42 శాతం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలన్నారు. తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్బీసీ ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేయాలని డిమాండ్చేశారు. రాజకీయాలకతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మోకు దెబ్బ జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన భిక్షపతిగౌడ్, బీసీ జేఏసీ నాయకులు రామంచి ప్రతాప్, కందకట్ల సారయ్య, యేశబోయిన సాంబయ్య యాదవ్, వీరబాబు, జంపన్న పాల్గొన్నారు.
