ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘అత్త సొమ్ము అల్లుడి దానం’లా ఉందని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ దేశంలో ఆర్థిక అసమానతలు, అస్థిరతను పెంచుతోందని మండిపడ్డారు. యూనియన్బడ్జెట్పై బుధవారం బాగ్ లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి ఆఫీసులో మేధావులు, బీసీ, మహిళా సంఘాల నాయకులతో ఆయన విశ్లేషణ చేపట్టారు.
దాసు సురేశ్మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక విధానాలు పేదవాడి నడ్డి విరిచేలా ఉన్నాయన్నారు. మౌలిక వసతులు, గ్రామీణ రోడ్లు, ఉద్యోగులు, ఆసరా పేరుతో దేశ సంపదను కార్పొరేట్కంపెనీలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. ఆర్థిక గణాంకాలు ఇంత దయనీయంగా ఉంటే అమృతకాల బడ్జెట్ ఎలా అవుతుందో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్అట్టడుగుల వర్గాలపై తీవ్రమైన వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. బీసీ ఐక్యవేదిక మహిళా అధ్యక్షురాలు కరుణశ్రీ, నారగోని, బండారు పద్మావతి, దీపిక, తాళ్లపాక భాగ్యలక్ష్మి, శ్రీమాన్ పాల్గొన్నారు.
