
ముషీరాబాద్, వెలుగు: మహిళా బిల్లులో బీసీ మహిళలకు జనాభా ప్రకారం సబ్ కోటా ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో బీసీ మహిళలకు ప్రాతినిథ్యం కల్పించాలని కోరారు.
విద్యానగర్ బీసీ భవన్లో ఆదివారం జరిగిన బీసీ మహిళా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ మహిళలకు జరుగుతున్న అన్యాయం, సబ్ కోటా విషయంలో ప్రజాప్రతినిధులను మాట్లాడాలని కోరారు. మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ జి పద్మ, రమాదేవి, అనురాధ పాల్గొన్నారు.