
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్కప్ ప్రిపరేషన్స్ కోసం బీసీసీఐ భారీ ఎత్తున ప్లాన్స్ వేస్తోంది. ఇందుకోసం మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆసియా కప్ ( సెప్టెంబర్ 17న )ముగిసిన తర్వాత, వరల్డ్ కప్ వామప్ మ్యాచ్లకు ముందు ఈ సిరీస్ జరిగేలా షెడ్యూల్ను రూపొందిస్తున్నది. వరల్డ్ కప్లో ఆడే ఫైనల్ ఎలెవన్ను ఎంపిక చేసుకునేందుకు ఈ సిరీస్ను ప్రామాణికంగా తీసుకోవాలని బోర్డు టార్గెట్గా పెట్టుకుంది.
ఇండియా పిచ్లను దృష్టిలో పెట్టుకుని తుది జట్టులో స్పిన్నర్లు, పేసర్లు ఎంత మంది ఉండాలన్న దానిపై ఓ అంచనాకు రానుంది.