న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. షెడ్యూల్ ప్రకారమే టీ20 వరల్డ్కప్ జరుగుతుందని బీసీసీఐ మరోసారి స్పష్టం చేసింది. అయితే మొదట షార్ట్ లిస్ట్ చేసిన 9 నగరాలకు బదులుగా ఐదు వేదికల్లో మాత్రమే మ్యాచ్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఇండియాలో అనివార్య పరిస్థితులు తలెత్తితే.. బ్యాకప్ వెన్యూగా యూఏఈని కూడా సెలెక్ట్ చేసుకుంది. ‘టీ20 వరల్డ్కప్కు ఇంకా ఐదు నెలల టైమ్ ఉంది. అప్పటి వరకు దేశంలో చాలా మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుంది. కాబట్టి మెగా ఈవెంట్ నిర్వహణకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మ్యాచ్లను నాలుగు లేదా ఐదు వేదికలకే పరిమితం చేయాలన్న ఆప్షన్ కూడా ఉంది’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నాడు. టీ20 వరల్డ్కప్ను దృష్టిలో పెట్టుకుని ఐపీఎల్ బయో సెక్యూర్ ఎన్విరాన్మెంట్ను పరిశీలించేందుకు ఐసీసీ టీమ్ ఒకటి ఈ నెల 26న ఢిల్లీకి రావాల్సి ఉంది. కానీ ట్రావెల్ బ్యాన్ కారణంగా ట్రిప్ పోస్ట్పోన్ అయ్యింది. సిచ్యువేషన్ నార్మల్కు వచ్చిన తర్వాత ఐసీసీ టీమ్ ఇక్కడ పర్యటిస్తుందని సదరు అధికారి తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా.. యూఏఈని ఎప్పట్నించో సెకండ్ అప్షన్గా ఉంచుకున్నామని బీసీసీఐ జనరల్ మేనేజర్ ధీరజ్ మల్హోత్రా వెల్లడించాడు. లాస్ట్ ఇయర్ ఐసీసీ మీటింగ్లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నామన్నాడు.
ఐదు వేదికల్లోనే టీ20 వరల్డ్కప్!
- ఆట
- May 1, 2021
మరిన్ని వార్తలు
-
నేత్రకు ఒలింపిక్ బెర్త్
-
ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి-అభిషేక్
-
రిషబ్, అక్షర్ ఉండాలి: గంగూలీ
-
కివీస్దే నాలుగో టీ20
లేటెస్ట్
- పాలమూరుకు స్పెషల్ స్టేటస్ తేలేదంటున్నరు, నేనేమన్నా కేంద్ర మంత్రినా: డీకే అరుణ
- సీఎం ఛోటే భాయ్.. పీఎం బడే భాయ్ : కేసీఆర్
- రుణమాఫీ చేసి తీరుతం : మంత్రి పొన్నం
- ఈతకు వెళ్లి తండ్రీకొడుకు మృతి
- నేత్రకు ఒలింపిక్ బెర్త్
- కాంగ్రెస్కు మాల సంఘాల జేఏసీ మద్దతు
- 24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి
- ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి-అభిషేక్
- ఇక్కడ బీఆర్ఎస్కు పట్టిన గతే అక్కడ బీజేపీకి పడుతుంది: మంత్రి కొండా సురేఖ
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన బాలుడు
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు