తిరుమల నడకమార్గంలో ఎలుగుబంటి హల్ చల్

తిరుమల నడకమార్గంలో ఎలుగుబంటి హల్ చల్

తిరుమల కాలినడక మార్గంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఏడవమైలు వద్ద 2023 జులై 31 సోమవారం రాత్రి 9.10 గంటల సమయంలో నడకమార్గంలో  ఐదు నిమిషాలు అక్కడే ఎలుగుబంటి సంచరించింది. ఆ తర్వాత కొంత సమయానికి మార్గాన్ని దాటి అడవిలోకి వెళ్లింది. దీన్ని గుర్తించిన ఓ గూర్ఖా సెల్‌ఫోన్‌లో వీడియా తీశాడు. గతంలో చిరుతల సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురికాగా.. తాజాగా ఎలుగుబంట్లు సంచారంతో భక్తులతో పాటు స్థానికులును ఆందోళనకు గురిచేస్తోంది.