బోనులో చిక్కిన ఎలుగుబంటిని వదిలేశారు

బోనులో చిక్కిన ఎలుగుబంటిని వదిలేశారు

శ్రీశైలంలో ఆగస్టు 18న బందించిన ఎలుగుబంటిని ఇవాళ ఉదయం వెలుగోడులోని అటవీ ప్రాంతంలో వదిలేశారు  అటవీశాఖ అధికారులు. శ్రీశైలం శిఖరేశ్వరం ఆలయ పరిసరాల ప్రాంతాలలో సంచరిస్తున్న ఎలుగుబంటిని ఆగస్టు 18 అర్ధరాత్రి 1 గంట సమయంలో బోను ద్వారా బంధించారు. 

 ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అలెన్ చాంగ్ టేరాన్ ఆదేశాల మేరకు శ్రీశైలం రేంజర్ నరసింహులు,సెక్షన్ ఆఫీసర్ మదన్ పర్యవేక్షణలో రెస్క్యూట్ టీం,స్థానిక అటవీ శాఖ సిబ్బంది కలిసి ఎలుగుబంటిని వెలుగోడు దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

తిరుమలలో  జరిగిన ఘటనతో  శ్రీశైలంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు. దీంతో సిబ్బంది పెట్రోలింగ్ చేసిన బోనులు ఏర్పాటు చేసి ఎలుగుబంటిని బందించారు.