
సిటీ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి అందగత్తెలు తరలి వస్తున్నారు. బుధవారం మిస్ లాట్వియా మరిజా ఎలిజిబెత్మిసురోవా, మిస్ కజకిస్తాన్ సబినా ఇడ్రోస్సోవా, మిస్ సింగపూర్ డెల్వినా కత్రీనా కె లాతూర్, మిస్ డెన్ మార్క్ ఎమ్మా హెస్ట్థామ్సన్, మిస్ మంగోలియా ఎర్డన్స్వుడ్బట్బయార్, మిస్ నికరాగ్వా రోడ్రిగ్యుజిలేగు వేర్వేరు ఫ్లైట్లలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోగా అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఎయిర్పోర్టులో భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే వివరాలు తెలుసుకుంటున్నారు. మిస్ వరల్డ్ పోటీదారులను సిటీకి తీసుకెళ్తున్న వెహికల్స్ డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
– వెలుగు, శంషాబాద్