
సదాశివనగర్, వెలుగు : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆదివారం బీరప్ప ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కుర్మ సంఘం మండల అధ్యక్షుడు కందూరి బీరయ్య ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా కుర్మ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.
వర్షాలు పడి పంటలు బాగా పండాలని, జీవాలు రోగాలు రాకుండా ఉండాలని స్వామివారికి పూజలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రెడ్డి మల్లేశ్, రెడ్డి అశోక్, గంగాధర్, శ్రీనివాస్, శివ్వయ్య, నారాయణ, శేఖర్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.