
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న మూవీని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అని టైటిల్ పెట్టడం వెనుకున్న ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ను దర్శకుడు బాబీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీరయ్య అనే టైటిల్ తనకు చాలా ఇష్టమని బాబీ చెప్పారు.
వెంకీమామ షూటింగ్ టైమ్ లో నాజర్ తనకో పుస్తకం ఇచ్చారని, అందులోని వీరయ్య అనే క్యారెక్టర్ తనకు బాగా నచ్చిందని బాబీ తెలిపారు. అంతేకాకుండా చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఆయనకు తొలి ఫొటో షూట్ నిర్వహించిన వ్యక్తి పేరు కానిస్టేబుల్ వీరయ్యనే అని చెప్పారు. ఆ ఫొటోల వల్లనే చిరంజీవి మద్రాసు వచ్చారని.. అందుకే తన సినిమా టైటిల్ లో వీరయ్య అనే పేరు ఖచ్చితంగా ఉండాలని అనుకున్నట్లుగా బాబీ వెల్లడించారు. చిరుతో సినిమా అనగానే ముందుగా తనకు ఈ రెండు గుర్తుకొచ్చాయని.. అందుకే ఆ పేరుతో ఓ పాత్రను సృష్టించి, దాన్నే టైటిల్ గా పెట్టానని స్పష్టం చేశారు
శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. గాడ్ఫాదర్ తర్వాత చిరు నుంచి వస్తోన్న మూవీ కావడంతో వాల్తేరు వీరయ్యపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.