లంబాడీలకు కాంగ్రెస్ అన్యాయం .. లంబాడీ హక్కుల పోరాట సమితి

లంబాడీలకు కాంగ్రెస్ అన్యాయం .. లంబాడీ హక్కుల పోరాట సమితి

ఖైరతాబాద్, వెలుగు :  టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్​ పార్టీ లంబాడీలకు అన్యాయం చేసిందని లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం ఆరోపించింది.  మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో   నాయకులు శ్రీనివాస్ ​నాయక్​, బాలాజీ నాయక్​, భాస్కర్​ నాయక్​ మాట్లాడుతూ.. లంబాడీ తెగకు చెందిన బెల్లయ్య నాయక్​కు టికెట్ కేటాయించలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నామని, తమకు అన్యాయం చేసిన  ఏ పార్టీ కూడా రాజకీయంగా మనుగడ సాధించదని హెచ్చరించారు.  కోట్లు ఇచ్చిన వారికే రేవంత్​రెడ్డి సీట్లు ఇచ్చారని వారు ఆరోపించారు. భారత్ ​జోడో యాత్రలో రాహుల్​గాంధీతో తిరిగిన వ్యక్తి బెల్లయ్య నాయక్​ అనిపేర్కొన్నారు. పేద స్టూడెంట్లకు ఇప్పటివరకు స్కాలర్​షిప్​ఇవ్వని బీఆర్ఎస్​ను ఓడించాలన్నారు. లంబాడీ హక్కుల పోరాట సమితి, గిరిజ విద్యార్థి సంఘానికి ఏ పార్టీలతో సంబంధం లేదన్నారు. సమావేశంలో మల్లేశ్ పాల్గొన్నారు.