- సీటు బెల్టు పెట్టుకోనివారిని జైలులో వేసేలా చట్టాలు తేవాలి: ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి రూరల్, వెలుగు: ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్అన్నారు. తాండూర్మండలం కొత్తపల్లి వారసంత ఆవరణలో తాండూర్పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీఐ దేవయ్య అధ్యక్షతన మంగళవారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జాతీయ రహదారి భధ్రత కమిటీ చైర్మన్, కలెక్టర్కుమార్దీపక్, ఎమ్మెల్యే వినోద్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, సబ్కలెక్టర్మనోజ్ చీఫ్గెస్టులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత సూత్రాలు పాటించాలన్నారు. సీట్బెల్ట్ధరించకుండా వాహనాలు నడిపే వారిని జైలులో వేసేలా కొత్త చట్టాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కలెక్టర్, డీసీపీ మాట్లాడుతూ.. రహదారి నియమాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయన్నారు.
అనంతరం రోడ్డు ప్రమాదాల్లో చనిపోయినవారి కుటుంబలకు ఎమ్మెల్యే వినోద్, బెల్లంపల్లి ఆర్యవైశ్య సంఘం, తాండూర్ఫర్టిలైజర్యూనియన్నగదు సాయం అందజేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి , డీసీసీ ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్మహేందర్రావు, మార్కెట్కమిటీ మాజీ చైర్మన్మురళీధర్రావు, మాజీ ఎంపీపీ సిరంగి శంకర్, ఎండీ ఈసా, తహశీల్దార్జ్యోత్స్య, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
