ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..బెన్ఫిట్ షోకు ప్రభుత్వం అనుమతి

ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..బెన్ఫిట్ షోకు ప్రభుత్వం అనుమతి

ప్రస్తుతం ఇండియా వైడ్గా వినిపిస్తోన్న సినిమా ఏదైనా ఉందంటే..అది ప్రభాస్ సలార్. ఏకంగా సలార్.. సలార్..అంటూ ఆడియన్స్ లో సలార్ నామస్మరణ వినిపిస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తోన్న హై ఓల్టేజ్ మూవీ..మరో రెండ్రోజుల్లో (డిసెంబర్ 22 న) థియేటర్లో సందడి చేయబోతుంది. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.

సలార్ సినిమాకు డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంట నుంచే బెన్ఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చింది. అలాగే సలార్ మార్నింగ్ షో 4 am కు మొదలై..రోజుకు 6 షోస్ పడనున్నాయి. ఇప్పటికే  సలార్ సినిమా టికెట్స్..ఆన్లైన్ బుకింగ్స్ కూడా మొదలై ఫిల్ అయిపోతున్నాయి. 

ఇక సలార్ సినిమా టికెట్ల ధరల విషయానికి వస్తే..సింగిల్ థియేటర్లో టికెట్ రేట్కు అదనంగా రూ.65 పెంచగా..మల్టీప్లెక్స్లో టికెట్ ధరకు అదనంగా రూ.100 పెంచినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ టికెట్ల ధరలు డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 వరకు ఉండనున్నాయి. ఏపీ ప్రభుత్వం 'సలార్' టికెట్ రేట్ కు అదనంగా 40 రూపాయల వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది.

ఇప్పటికే సలార్ సినిమా నుంచి విదలయిన రెండు ట్రైలర్స్కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలని ఫ్యాన్స్ ఎదురు చేస్తోన్నారు.ఇక థియేటర్లో ఖాన్సార్ ఈ కాదు, అన్నీ థియేటర్లు .హౌస్‌ఫుల్స్తో ఎరుపెక్కలా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.